డెంగ్యూ, విష జ్వరాలపై అవగాహన కలిగి నియంత్రణకు తగిన జాగ్రత్తలు పాటించాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. బొద్దికూరపాడు పంచాయితీ చింతల పాలెం గ్రామాలలో శుక్రవారం డెంగ్యూ, విషజ్వరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జ్వరం వచ్చిన సమయంలో నమీప పీహెచ్సీని సందర్శించి తగిన పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. దోమల నివారణకు పరిసరాల పరిశు భ్రత తప్పక పాటించాలని, ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్చాల్చిన నీటిని తాగాలని సూచించారు. హెచ్ ఈఓ గోపి నాయక్, ఎం ఎల్ హెచ్ పీ మరియమ్మ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

