విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకున్న డాక్టర్ కోట నీలిమ విశాల్ సుధాం.

బేగంపేట సెప్టెంబర్ 2(జే ఎస్ డి ఎం న్యూస్)
ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాములు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వినాయకుడు మూడు తలలు ఎనిమిది చేతులు ఐదు సర్పపు పడగలతో నిర్మించారని ఇది దైవత్వం మరియు పర్యవరణ స్పృహతో ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ డాక్టర్ కోట నీలిమ ,విశాల్ సుదాం లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.వారి వెంట చిరంజీవి, పి ఎల్ కృష్ణ అఖిల్ షాబాద్ మోహిత్ బీసా  తదితరులున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *