లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రెస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రెస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లతా పేస్కర్ రచించిన పలు రచనలు నేటితరం యువతరానికి పూర్తి కానున్నాయన్నారు.అవి వారిని ఎంతో చైతన్యం చేసేలా ఉన్నాయన్నారు. ఆమె రచించిన హిబ్బిస్కస్ హాట్, ది మిస్టీరియస్ టేల్స్ ఆఫ్ మహారాజపురం, మిట్టు మిస్ క టిట్స్, హరి నారాయణ స్ట్రీట్, మై మామ్ ఇస్ మై ఫేవరెట్ హీరో వంటి అద్భుతమైన పుస్తకాలను ఆమె రచించారని, అవి ఎంతో ప్రభావితం చేస్తాయన్నారు. ఆలాంటి రచయితను సన్మానించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెస్మా సభ్యులు పాల్గొన్నారు.

