బేగంపేట సెప్టెంబర్ 30 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ హిందీకి అధికార భాష హోదా కల్పించిందని బేగంపేట విమానాశ్రయంలో మంగళ వారం ముగిసిన హిందీ పక్షోత్సవాలలో ఏర్పాటు జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఇంచార్జ్ అచింత్ కుమార్ దత్త అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో సెప్టెంబర్ 14 నుంచి 29 వరకు హిందీ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం ముగింపు సందర్భంగా సర్టిఫికెట్ ప్రధాన ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఇంచార్జ్ అచింత్ కుమార్ దత్త మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు జాతీయ సమైక్యత సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచడంలో హిందీ కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమానికి అతిథిగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ భగవాన్ గవాడే మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో హిందీ ప్రభావం పెరుగుతుందని నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్ కు చేరువయ్యే పోటీలో ఉన్నాయని అలాంటి పరిస్థితిలో హిందీ బాటలు వేస్తుందని చెప్పారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న అధికార భాషా పనులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అవార్డు విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రధానం చేశారు కార్యక్రమంలో ఏటీసీ జనరల్ మేనేజర్ గోప కుమార్ ప్రసిల్లా ప్రియా, అపూర్వజైన్ శుక్లా ఉపేంద్ర కుమార్ ,నేతా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

