జర్మనీలో భర్త ఆచూకీ కోసం సీఎం ప్రజావాణిలో మహిళ అర్జీ -తక్షణం స్పందించిన సీఎం ప్రజావాణి ఇంచార్జి చిన్నారెడ్డి.జర్మనీ, కెనడా ఇండియన్ ఎంబసీలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం – ఆడపడుచుకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.

బేగంపేట సెప్టెంబర్ 30 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కెనడాలో నివాసం ఉంటున్న తనకు చెప్పా పెట్టకుండా జర్మనీకి వెళ్లిపోయిన భర్త ముజమిన్ గులాబ్ నాయక్ వాడి ఆచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్ పేట్ కు చెందిన షబానా నస్రిన్ అహ్మద్ సీఎం ప్రజావాణిలో అర్జీ దాఖలు చేశారు.ఈ అంశంపై తక్షణం స్పందించి స్పందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రికి లేఖ రాసి నస్రీన్ కు న్యాయం చేయాలని కోరారు.
శేషాద్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎన్నారై విభాగం అధికారులు జర్మనీ, కెనడా ఇండియన్ ఎంబసీలకు, కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖలకు లేఖ రాశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఎన్నారై మహిళా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను కోరుతూ కూడా జిఏడి ఎన్నారై విభాగం అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు సీఎం ప్రజావాణి ఇంచార్జ్ జి చిన్నారెడ్డికి జిఏడి ఎన్నారై విభాగం జాయింట్ సెక్రెటరీ శివలింగయ్య తిరుగు సమాధానం ఇస్తూ లేఖ రాశారు. ఈ వ్యవహారం అంతా చకచకా నాలుగు రోజుల్లో జరిగిపోయాయి.కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముజామిల్ తో ఆరెళ్ల క్రితం పెళ్లి జరిగిందని, కెనడా నుంచి ఇండియాకు రావాలంటే తన నాలుగేళ్ల బిడ్డకు ఇండియన్ పాసుపోర్టు సహా పలు డాక్యుమెంట్స్ పై తండ్రి సంతకాలు అవసరం అని, భర్త ఆచూకీ కోసం షబానా నస్రిన్ ఇచ్చిన పవర్ ఆఫ్ ఆటార్నీ ద్వారా తల్లి సెప్టెంబర్ 19న సీఎం ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. చిన్నారెడ్డి తక్షణ స్పందనతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. తెలంగాణ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆమెకు పూర్తి భరోసాను కల్పిస్తూ నస్రీన్ కు న్యాయం చేసేందుకు యావత్ ప్రభుత్వం యంత్రాంగం కృషి చేస్తోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *