ది ప్రకాశం జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి వారు శుక్రవారం ప్రకాశం భవనానికి వచ్చారు. ఎంపీ
ఈ సందర్భంగా మాజీ సైనికులను కలెక్టరుకు పరిచయం చేశారు. వారి యోగక్షేమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నగరంలో రంగరాయుడు చెరువుకు ఈశాన్యం వైపున జాతీయ జెండా పక్కన అమర జవానుల స్మారక స్థూపం నిర్మించేందుకు 100 × 80 అడుగుల విస్తీర్ణంలో స్థలం కేటాయించాలని కలెక్టరుకు వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టరును కలిసిన వారిలో సంఘం ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నెప్పల్లి నాగేశ్వరరావు, సంఘం జిల్లా ప్రెసిడెంట్ ఆలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ దశరథ రామయ్య ఉన్నారు.
