ప్రజలు ఆర్ధికంగా నష్ట పోరాదని, ప్రజలు ఆరోగ్యంగా, సంతోషం గా ఉండాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
శనివారం టంగుటూరు మండలం,తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు రూ.37.88 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్ధికంగా నష్ట పోరాదన్న ఉద్దేశ్యంతో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు కొండపి నియోజకవర్గ పరిధిలో 71 మందికి 37 లక్షల 88 వేల రూపాయలు చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 996 మంది లబ్దిదారులకు 7 కోట్ల 95 లక్షల 53 వేల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కొండపి నియోజక వర్గానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం పట్ల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెల్పుతున్నట్లు మంత్రి అన్నారు.
