బేగంపేట నవంబర్ 6 (జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ హార్ట్ ఇనిస్టిట్యూల్ ఆధ్వర్యంలో 58 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో ఆన్యురిజంతో ఆయోర్టాలో ఏర్పడిన బ్లాక్ ను ఎండోవాస్క్యులర్ పద్దతిలో 13 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స ను విజయవంతంగా
నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడగలిగామని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హెచ్ ఓడి కార్డియాలజీ మరియు కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు.
గురువారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఈ ఆరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరంగల్ కు చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం ఆయోర్దాలో ఆన్యురిజంతో బ్లాక్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మొదట మరో హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకున్నా, ఫలితం లేకపోవడంతో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ కు రావడంతో డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, ఆనస్థీషియా బృందం సమిష్టిగా ఈ ఆరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
ఈ కేసులో ఆన్యురిజంతో ఆయోటా మొత్తం బ్లాక్ అయింది. ఆయోటాలో 13.5 సెంటీమీటర్ల మేర ఆన్యురిజంతో బ్లాక్ ఏర్పడింది. దీంతో రోగి ఎడమ వైపు ఒక లంగ్ పూర్తిగా పనిచేయకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో మినిమల్లీ ఇన్వేజివ్ విధానం మరియు ఒపెన్ సర్జరీని కలిపిన హై బ్రీడ్ చికిత్సా విధానంలో రోగి కుడి కాలు రక్త నాళం ద్వారా గుండె రక్తనాళం అయోర్టాలో బ్లాక్ అయిన ప్రాంతాన్ని మొత్తంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వివిధ రకాల బెలూన్లు ఉపయోగించి ఎండోవాస్క్యులార్ గ్రాఫ్ట్ ఆమర్చి, ఎన్యురిజం ఎంట్రీ పాయింట్ను మూసివేయడం ద్వారా ఎన్యురిజం తిరిగి రాకుండా చేయడం, మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు, కుడి, ఎడమ చేతులకు రక్తం సరఫరా చేసే నరాలకు గ్రాఫ్ట్ లు ఆమర్చి రక్త సరఫరా మేయింటేయిన్ చేయడం, కార్డియాక్ అరెస్ట్ చేసి, బాడీ టెంపరేచర్ తగ్గించి, మెదడుకు, గుండెకు రక్తసరఫరా ఆగకుండా చూస్తూ శస్త్రచికిత్సను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తంగా 13 గంటల పాటు శస్త్రచికిత్సను విజయంతంగా నిర్వహించడం ఆరుదైన శస్త్రచికిత్సగా పేర్కొన్నారు.
ఇలాంటి హై రిస్క్ శస్త్రచికిత్సలు నిపుణులైన డాక్టర్లు, అన్ని సదుపాయాలున్న సెంటర్ తో పాటు టీం అప్రోచ్ ఉంటేనే సాధ్యం. ఈ రోగికి ఆయోడిన్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి, ఎడమ లంగ్ పనిచేయకపోవడంతో బ్రీతింగ్ సమస్యలను అదిగమిస్తూ ఈ కేసును సవాలుగా తీసుకొని విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించామని ఇప్పుడు రోగి ఆరోగ్యంగా ఉన్నాడని రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతున్నాడని. తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ పి.ఎన్.రావు, డాక్టర్ సందీప్ జనార్థన్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ రాజారాం, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ పార్థసారధి, డాక్టర్ కావ్య అన్నపరెడ్డి, హార్ట్ ఇన్సిస్టిట్యూట్ ఏవిపి చందర్ తేజావత్ తదితరులు పాల్గొన్నారు.



