సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు -వైద్య రంగంలో మరింత ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తాం – డాక్టర్ ఏ.వి గురవారెడ్డి.

బేగంపేట నవంబర్ 12
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వైద్యరంగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కిమ్స్ గ్రూప్ అగ్రగామిగా ముందుకు సాగుతోందని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్ రావు తెలిపారు. కిమ్స్ సన్ షైన్ లో భాగమైన సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు జాయింట్ రీప్లేస్మెంట్ భాగంలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి అన్నారు. బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలోప్రపంచవ్యాప్తంగా మెడికల్ పరికరాలను అందజేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన స్ట్రైకర్ కంపనీ మ్యాకో రోబోతో (రోబోటిక్ అసిస్టెడ్) జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు పదివేలకు పైగాశస్త్రచికిత్సలను నిర్వహించడం, హాస్పిటాలిటీ, రీసెర్చ్ పేపర్లు అందజేయడం వంటివిషయాలనుపరిగణలోకి తీసుకొని సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందజేసినట్లు స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రసిడెంట్, జనరల్ మేనేజర్ అమన్ రిషి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్ట్రైకర్ కంపెనీ వారు సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్లో చేసిన మోకాలు, హిప్ సర్జరీలు, హాస్పిటాలిటీ, టీం వర్క్, రీసెర్చ్ పబ్లికేషన్ల ఆధారంగా దేశంలోనే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ కు ఈ అవార్డును మొట్టమొదటి సారిగా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలకే కాదు హైదరాబాద్ కు గర్వకారణంగాపేర్కొన్నారు. ప్రపంచంలో ఇండియా హెల్త్ టూరిజంలో ముందుకు దూసుకువెళ్తుందని, అందులో హైదరాబాద్ మరింత ముందుండటం గొప్ప విషయంగా తెలిపారు. విదేశాల నుంచి వచ్చే
వారికి మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు బాంబే వంటి నగరాల్లో పది లక్షల వరకు ఖర్చవుతుంటే, హైదరాబాద్ లో మనం నాలుగు లక్షల్లోపే చేస్తున్నామన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందని, రీసెర్చ్ మరింత ముందుకు వెళ్లడంతో పాటు పేషెంట్స్ కు మరింత ఖచ్చితమైన, నాణ్యమైన వైద్యసేవలను అందిస్తామని తెలిపారు. స్ట్రైకర్ కంపెనీతో ఉన్న అనుబంధంతో మునుముందు టెక్నాలజీని మరింత అందుబాటు ధరల్లో ఉండేవిధంగాతీసుకువస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రోబోటిక్ అసిస్టెంట్ శస్త్రచికిత్సల వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ కుషాల్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. ఈకార్యక్రమంలో సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *