ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిలా రెడ్డి ని కలిసిన రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్, దర్శి నియోజకవర్గం సమన్వయకర్త కైపు వెంకటకృష్ణా రెడ్డి

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కైపు వెంకటకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, కొనసాగుతున్న కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళికలు తదితర విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఈ భేటీలో షర్మిలా రెడ్డి కీలక సూచనలు అందించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలపై గళం విప్పాలని, కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చే దిశగా కృషి చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి కి సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *