స్వా మిత్ర సర్వేలో తమ నివాసాలకు, ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్యూటి ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి కోరారు. మల్కాపురం పంచాయితీలో మంగళవారం సర్పంచి వలి అధ్యక్షతన స్వామిత్ర సర్వే ఫేజ్ -2 లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో సమాచారం మేరకు పీపీఎం లను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రామ సభలో ప్రజల ముందు చదివి వినిపించారు. అందులో యజమానుల అంగీకారం తీసుకున్నారు. పలు అభ్యంతరాలను సభ దృష్టికి తెచ్చారు. డిప్యూటి ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, గ్రామ కార్యదర్శి శేషమ్మ, టిడిసి నాయకుడు వలి, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
