జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగాభవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజారు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాలరాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశ్వీర్వాదం అందించారు. ఈఓ వాసు బాబు, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.
అన్నదానం ప్రారంభం ….
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థాన అన్నదాన సత్రంలో ఆదివారం అన్నదానం ప్రారంభించారు. అమ్మవారి అన్నదాన సత్రంగా మొదలు పెట్టి తర్వాత స్వంతహాగా నడుపటానికి సిద్ధం చేసుకున్న మాజీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మంపై ఫిర్యాదు చేయటంతో విచారించి దేవాదాయశాఖ అన్నదాన సత్రంను స్వాధీనం చేసుకున్నది. అనంతరం పేరు మార్పు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈఓ వాను బాబు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

