జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులను ప్రోత్స హించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజబాబు అన్నారు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైనఅన్ని సౌకర్యాలను కల్పిస్తా మని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతు లకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు కల్పిస్తా మని ఆయన చెప్పారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతు ల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. విభిన్న ప్రతిభావంతు లకు నెలకు 6వేల రూపాయలు పెన్షన్లు ప్రభుత్వం అంది స్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో విభిన్న ప్రతిభా వంతుల కోసం సమగ్ర సంక్షేమ హాస్టల్ ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక లు తయారు చేయాల నిఅధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. విభిన్న ప్రతిభా వంతులు ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. విభిన్న ప్రతిభా వంతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించ డానికి కలెక్టరేట్ లో ఒక లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే వివిధ రకాల పనుల కోసం వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకమైన మరుగు దొడ్లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. విభిన్న ప్రతిభా వంతుల కోసం స్వచ్ఛంద సంస్థలు బాగాపని చేస్తు న్నాయని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా విభిన్న ప్రతిభా వంతుల స్వయం సహాయక సంఘాల నుబలోపేతం చేయడానికి వారిఆర్థిక అభివృద్ధి కోసం కృప స్వచ్చంద సంస్థతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఎం.ఓ.యు కుదుర్చు కున్నారు.అనంతరం విభిన్న ప్రతిభా వంతులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్, గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, లోక్ ఆదాలత్ జడ్జి ఎస్.కె ఇబ్రహీం షరీఫ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారి సువార్త, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిప ల్ కమిషనర్ వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


