రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ -పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మీ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరీత,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,ఇతర ముఖ్య నేతలు, అధికారులు.

హైదరాబాద్ డిసెంబర్ 10(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పొన్నంతో పాటు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి రాంగోపాల్పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫోన్ నెంబర్ ప్రభాకర్ మాట్లాడుతూ
రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఇప్పటికే హైదరాబాద్ ,కరీంనగర్ , నిజామాబాద్ , నల్గొండ ,సూర్యాపేట లలో ఈవి బస్సులు నడుస్తున్నాయన్నారు.
ప్రజా ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ప్రారంభం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అని ఆయన అన్నారు.ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ప్రారంభించుకున్నాం
ఆర్టీసీ డ్రైవర్ ,కండక్టర్, శ్రామిక్ ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు.. వారందరికీ అభినందనలు తెలియ జేశారు.ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు,రూ 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారన్నారు.
హాస్పిటల్ లు ,విద్యా, దేవాలయాలు , ఉద్యోగాలు బంధువుల ఇంటికి ఇలా ప్రయాణాలు చేశారు..దేవాదాయ శాఖ ఆదాయం మహా లక్ష్మీ పథకం ద్వారా పెరిగింది.2 సంవత్సరాల్లో ఇప్పుడున్న
40 శాతం బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ఆర్టీసీ లో నూతన రక్తం వస్తుంది కొత్తగా డ్రైవర్లు , కండక్టర్ లు ,శ్రామిక లు వస్తున్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ బస్సులను మహిళను యజమానులను చేసిందన్నారు.ఢిల్లీ లో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్న పరిస్థితి ఉంది..ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ , స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది.ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం,ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుంది.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక అంశాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నానన్నారు.
ప్రయాణికులకు సౌకర్యంగా ఈవి బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర,శ్రీశైలం , యాదాద్రి లకు ప్రత్యేల బస్సులు.నూతన బస్ డిపో ల ఏర్పాటు , బస్ స్టేషన్ ల అభివృద్ధి చేసుకుంటున్నాం
1932 లో ప్రారంభించిన ఆల్బియన్ బస్సు ,మద్యలో వచ్చిన ఎర్ర బస్సు ,ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినాము..
ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు వచ్చిన దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపాం.ప్రజా రవాణా లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం.ఈవి బస్సుల ప్రారంభోత్సవం వల్ల నగరంలో మరింత మెరుగ్గా బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.ఈవి పాలసీ తెచ్చాం..నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవి, సి ఎన్ జి, ఎల్ పి జి ఆటో లకు అనుమతిఇచ్చింది..
ఈవి బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేశారు.,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ 65 ఎలక్ట్రిక్ బస్సులనుప్రారంభించుకున్నాం అన్నారు.ప్రతి రోజు 60 లక్షల మంది ఆర్టీసీ లో ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారన్నారు.ఇప్పటి వరకు 251 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు.
8500 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారనీ,2400 బస్సులు కొత్తగా చేర్చుకున్నాం.
ఈ బస్సులు ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకున్నాం.ఇంటర్సిటీ బస్సులు కూడా వస్తున్నాయి
800 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే రెండు సంవత్సరాల్లో మొత్తం 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు.
ఈ బస్సుల ద్వారా స్మూత్ జర్నీ చేయవచ్చు, ప్రతి బస్ ఒక రోజు ఒక టన్ కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గిస్తుంది..81 శాతం బస్సులు మహా లక్ష్మీ స్కీమ్ ద్వారా నడిచే బస్సులు ఉన్నాయన్నారు.రాణి గంజి ఆర్టీసీ డిపో నుంచి తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఎండీ నాగిరెడ్డి తదితరులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *