సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించినజిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు

ఒంగోలు భాగ్యనగర్ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి నెంబర్ 1 ను శుక్రవారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వంట గదిని, తాగునీటి వసతులను, మరుగుదొడ్లను, స్టోర్ గదిని పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, వారి ఆరోగ్య పరిస్థితులు, కల్పిస్తున్న వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మాకు వసతులు బాగున్నాయని, ప్రతినెలా వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళతారని డి ఆర్ ఓ కు చెప్పడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి విద్యార్థులతో కలసి భోజనం చేయడం జరిగింది విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు బాలికల వసతి గృహంను పరిశీలించడం జరిగిందన్నారు. వసతులు, భోజనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వసతి గృహం లో మొత్తం 128 మంది విద్యార్థులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆయన వెంట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్, ఏ ఎస్ డబ్ల్యూ ఓ , రబియా, హెచ్ డబ్ల్యు ఓ కె. స్వప్నలత , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *