జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయ లక్ష్మిల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులను ఆశీర్వాదం అందించారు. ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. గుంటి గంగా భవాని ఆలయ అన్నదాన సత్రం లో అన్నదానం నిర్వహించారు.
