- గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు
- ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు
- రైలులో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు
గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, పర్యవేక్షణలో ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం మరియు ఇతర సిబ్బంది కలిసి మాదకద్రవ్యాలను గుర్తించే జాగిలం రాక్సీ సహాయంతో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను సమగ్రంగా పరిశీలించారు.
అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అలప్పుజా ఎక్స్ప్రెస్లో ఒంగోలు నుంచి సింగరాయకొండ వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సర్వంలయ్య , కుమ్మరాలో మోజా, గోద్రా తాలూకా, జార్ఖండ్ రాష్ట్రం, మిస్కర్మ గౌరవ్ , బీహార్ షరీఫ్ గ్రామం, నలంద జిల్లా, బీహార్ రాష్ట్రం. , శరవణ్ లయ్య , గోద్రా తాలూకా, జార్ఖండ్ రాష్ట్రం. మంతు మాంఝీ,గోద్రా తాలూకా, జార్ఖండ్ రాష్ట్రం. ప్రకాష్ మిర్ధా,,కలియన్ కితా గ్రామం, జార్ఖండ్ రాష్ట్రం. అనే ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జి.ఆర్.పి పోలీసులకు అప్పగించారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.
ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శివరామయ్య,సుదర్శన్, ఈగల్ టీం సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

