క్రిస్మస్ సందడి పల్లెల్లో ప్రారంభమైనది. క్రిస్మస్ వేడుకలకు ఇప్పటికే చర్చిలు సిద్ధం అయ్యాయి. జాలి, కరుణ, దయ కలిగి ఉండాలన్నదే ఏసుక్రీస్తు సందేశం . పేదలను దీసులను సేవించే వాడు నిజమైన మనిషి అన్న క్రీస్తు తత్వం ఎందరికి మార్గదర్శకం . ఈ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థనా గీతాలు చర్చిల్లో ఆలపిస్తున్నారు. క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా అన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద స్టార్స్ ఏర్పాటు చేసి క్రీస్తు రాకను స్వాగతిస్తున్నారు.రమణాల వారి పాలెం పడమర బజారు యూత్ ఆధ్వర్యంలో 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టార్ ప్రజలను ఆకట్టుకుంటుంది.

