సీఎం ప్రజావాణిలో 487 దరఖాస్తులు.

హైదరాబాద్ జనవరి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 487 దరఖాస్తులు అందాయి. వీటిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 127 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 57 ,ఇందిరమ్మ ఇండ్ల కోసం 203 ,ప్రవాసి ప్రజావాణికి ఒక దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్చార్జి ,రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తుల స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *