బేగంపేట జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోని ప్రకాశం నగర్ ఎక్స్ టెన్షన్ లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా షేక్ గౌస్ హాజరయ్యారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బస్తీ అధ్యక్షులు షేక్ గౌస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో బస్తి వైస్ ప్రెసిడెంట్ ఎండి అస్లాం, ప్రధాన కార్యదర్శి ఓం స్వామి, ట్రెజరర్ షేక్ రిజ్వాన్, అడ్వైజర్ సిహెచ్ శ్రీనివాస్ కాలనీవాసులు ఉర్దూ మదర్స విద్యార్థులు పాల్గొన్నారు .

