విద్యార్థులు పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని వికే ప్రభుత్వ పాఠశాల పరిశీలకులు, వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. వికే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులను గురువారం ఆయన పరిశీలించారు. వంద రోజుల ప్రణాళికలో బాగంగా ఎ సబ్జెక్టు అయితే కష్టంగా ఉంటుందో అందులో కొంత మేర అధిక సమయం కేటాయించి ముందుకు సాగాలని సూచించారు. స్నాక్స్ పంపిణీ చేసారు. మిగిలిన రోజులలో స్నాక్స్ కోసం శనగలు బస్తా అందించారు. ప్రధానోపాధ్యాయుడు ఎ ఆరోన్ మిల్టన్, ఎన్ ఏ యూవీ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
