తాళ్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుంటిగంగమ్మ హుండీని దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో శనివారం లెక్కించగా రూ 5,59,275 ల ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. 2025 సెప్టెంబర్ మాసం నుండి 2026 ఫిభ్రవరి వరకు 6నెలల పాటు భక్తులు హుండీలో వేసిన కానుకులను లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్పెక్టర్ సత్యనారాయణ, ఈవో నర్రా నారాయణరెడ్డి, ఆర్ఎ ప్రసాద్, భ్రమరాంబ సమితి సేవకులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
