అవదూత వెంకట రామయ్య స్వామి తిరునాళ్ల గురువారం భక్తి శ్రర్థలతో నిర్వహించారు.జ స్వామి వంశస్తులు ఐసీ కోటి రెడ్డి, ఐవీ రెడ్డి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భారీ అన్నదానం నిర్వహించారు. స్వామి వంశస్తులు పాట కచేరిని ఏర్పాటు చేసారు. స్వామి భక్తులు, స్వామి వంశస్తులు, పలువురు దాతలు ప్రొత్సాహంతో ట్రాక్టర్ రివర్స్ సోటీలు నిర్వహించారు.
మొదటి బహుమతి కుమ్మిత రమణా రెడ్డి (ప్రధమ), చుక్కా ఓక్కేన్న (ద్వితీయ) గోపి మల్కాపురం (తృతీయ) అనపర్తి అమోష్, రజానగరం (చతుర్థ) బహుమతులు గెలుపొందారు. వారికి ప్రధమ బహుమతి రూ. 5 వేలు శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, ద్వితీయ బహుమతి రూ. 4వేలు స్వామి వారి వంశస్తులు (ఐవీ రెడ్డి), తృతీయ బహుమతి రూ. 3వేలు కోట క్రిష్ణా రెడ్డి, చతుర్థ బహుమతి రూ. 2వేలు రేగడి వెంకటేశ్వర్లు అందించారు.

