జల ధార జల హారతి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో బుధవారం గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, నీటి సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ ఎఈ సుబ్బా రావు మాట్లాడుతూ మండలంలో జల ధార – జలహారతి లో చేపట్టటానికి అవకాశం ఉన్న పనుల ప్రతి పాదనలు పంపాలని కోరారు అనంతరం డ్వామా పీడీని కూడ కలసి జలహారతి లో చేపట్టనున్న పనుల గురించి పరిశీలించి చెరువుల గురించి వివరించారు. ప్రజా ప్రతినిధులు నహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పీడీ జోషఫ్ కూమార్ కోరారు. కరువది మేజర్ డిస్ట్రిబ్యూటన్ కమిటీ వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, తురక పాలెం చెరువు నీటి సంఘం చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
