దర్శి మండలంలోని బసిరెడ్డి పల్లి, చందలూరు గ్రామపంచాయతీ లలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేక గ్రామసభల ద్వారా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తేల రవికుమార్ పాల్గొని బంగారు బాల్యం కార్యక్రమం పై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెప్మా పీడీ తెల రవికుమార్, ఎంపీడీవో ఎల్ కృష్ణమూర్తి, ఈఓఆర్డి ఆవుల సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
