ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 ఫలితాల విడుదల -ఫలితాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థుల హవా -ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 86.35% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు-కాకినాడ జిల్లాకు చెందిన గోనెల్ల శ్రీ రామ శశాంక్ కు తొలి ర్యాంకు -120 మార్కులకు 120 సాధించిన 15 మందిలో అత్యధికులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థులే- అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన విశాఖపట్నం జిల్లా (10,516 మంది విద్యార్థులు)-25 మే, 2023న పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పత్రికల్లో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు..29 మే, 2023 నుండి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం-1 జులై, 2023 నుండి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం -ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో అందుబాటులో 77,117 సీట్లు-ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు-గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అదనంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు-2022-23లో 4000 మందికి పైగా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్-రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు శ్రీమతి సి.నాగరాణి

Continue reading