తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో పేరుతెచ్చుకున్న డాక్టర్ బంకా రత్నంను ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ డైరెక్టర్ గా ఉద్యోగోన్నతి పొంది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేయనున్న డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మిని, తూర్పు గంగవరం పీహెచ్లోలో వైద్యునిగా పని చేస్తూ ఉన్నత చదువుల కోసం వెళ్లనున్న డాక్టర్ బీ రత్నంను స్థానిక వైద్య సిబ్బంది గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ ఓ మాట్లాడుతూ… డాక్టర్ రత్నం సేవలను కొనియాడారు. డెంగ్యూ, కరోనా సమయంలో ఆయన సేవలకు గుర్తింపుగా అవార్డులను అందుకున్నారని అన్నారు. అనంతరం డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మి, బదిలీపై వెళ్లిన డాక్టర్ రత్నం ను వైద్యులు మౌనిక, శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దంత వైద్యులు రమ్య ఎంపీహెచ్ఐవో పి.చంద్రశేఖర్, వైద్యసిబ్బంది సుశీల, మస్తానమ్మ, సురేష్, శిల్పా, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.



