సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో విమాన నగర్ కు చెందిన మమతా హై స్కూల్ స్పార్డ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పాటశాల డైరెక్టర్ మమతా అద్వర్యం లో వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లాయూత్ , స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి ఎన్. సుధాకర్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీ డాజ్యొతి ని వెలిగించి స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ద్వారా క్రీడా గౌరవవందనాన్ని స్వీకరించారు . అనంతరం విద్యార్థులు చేసిన బాల్ డ్రిల్ , హోప్ డ్రిల్ , బట్టర్ ఫ్లై విన్యాసాలు చూపరులను వేశేషంగా ఆకర్షించాయి..అనంతరం హైదరాబాద్ జిల్లాయూత్ , స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ .. చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆసక్తి కలిగించాయని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి పతకాలను అందజేసి 2023.. 24 స్పోర్ట్స్ డే ఛాంపియన్ గా నిలిచినా ఆజాద్ హౌస్ జట్టుకు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను అందజేసి అభినందించారు . ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ డే ఫిజికల్ డైరెక్టర్ సుధీర్ , కోచ్ , రాజ్ కుమార్ ,పి ఈ టి లాజారియాస్ పాఠశాల ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు , పెద సంఖ్యలో పాల్గొన్నారు.




