వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరులో బుధవారం ట్రిపుల్ రైడింగ్, హెల్మేట్ లేకుండా నడుపుతున్న వాహనదారులను పరిశీలించి కౌల్సిలింగ్ నిర్వహించారు.
ఆటో వాలాలకు కౌల్సిలింగ్ ….
ఓవర్ లోడ్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మల్లిఖార్జున రావు అన్నారు. తాళ్లూరులో అధిక లోడ్ తో వెళ్తున్న ఆటోలను గుర్తించి కౌల్సిలింగ్ నిర్వహించారు. వాహన సామర్ధ్యానికి మంచి ప్రయాణికులకు ఎక్కిస్తే వాహనం వెళ్లే సమయంలో అదుపు తప్పినట్లయితే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, తమపై ఆధారపడి ఉన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుని ఆటోలు నడపాలని వాహనదారులను హెచ్చరించారు.

