విఆర్ఓలకు అదనపు బాధ్యతలు

తాళ్లూరు మండలంలోని పలు రెవిన్యూ గ్రామాలలో విఆర్ఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం తాళ్లూరు మండలంలో పని చేస్తున్న నలుగురు విఆర్ ఓలకు ఆయా రెవిన్యూ గ్రామాల ఇన్చార్జి బాధ్యతలను మంగళవారం అప్పగిస్తూ తహసీల్దార్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసారు. విఠలాపురం విఆర్ఓ రమణా రెడ్డి కి తురక పాలెం, మన్నేపల్లి సోమవరప్పాడు, శివ రామపురం విఆర్ఓ పి. చంద్రశేఖర్ రావుకు నాగంబొట్ల పాలెం, రామ భద్రాపురం లు, తూర్పుగంగవరం విఆర్ఓ పి .శివా రెడ్డికి దోసకాయల పాడు, బెల్లంకొండ వారి పాలెం, సర్వ మిట్ట, వెలుగు వారి పాలెం, బొద్దికూర పాడు, సూరాయ పాలెం, శంకర నారాయణ పురం లు, తాళ్లూరు విఆర్ ఓ నాగలక్ష్మికి లక్కవరం గ్రామాలు అప్పగిస్తూ తహసీల్దార్ ఉత్వర్వులు ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *