అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందించాలి – డి.ఆర్.డి.ఏ వెలుగు జిల్లా అధికారులతో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష

అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా   బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం  ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో డి.ఆర్.డి.ఏ వెలుగు జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్డిఏ వెలుగు ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజ్, సబ్సిడీ రుణాలపై సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, రుణాలు  అందించాలన్నారు. లబ్ధిదారులను గుర్తించి రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ఈ నెల చివరి లోపు మండలాల వారీగా రుణాల మంజూరు కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వెలుగు  సిబ్బంది పనితీరును అధికారుల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. బాధ్యతగా పనిచేయని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
*విశాఖ సీఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు*
*వీటి ద్వారా జిల్లాలో 5 వేల మందికిపైగా యువతకు  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు* -మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విశాఖ సీఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు, 5 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం  ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి తెలిపారు.  సోమవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ…..ఈ  నెల 14, 15 వ తేదీల్లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు ద్వారా 614 ఎంవోయూలతో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయి. అందులో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులతో 5 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన  సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేశ్ కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం. ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం..కానీ 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *