బేగంపేట ఫిబ్రవరి 12,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని రాణిగంజ్ సిటీలైట్ చౌరస్తా వద్ద ఉన్న గౌసేపాక్ దర్గాలో గురువారం గ్యార్వీ షరీఫ్ ఫాతియాను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నిర్వాహకులు ప్రేమ్, జావీద్, సలీం, శివ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, సతీష్,గణేష్, సూరి, అబ్బి, శివ, వినయ్, శ్రీనివాస్,సెల్ఫీ రాజు, జనార్దన్, రాజు తదితరులు ఉన్నారు.

