పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనాయి. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 184 మందికి గాను 182 మంది, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 249 మంది గాను 247, వికే ఉన్నత పాఠశాలలో 161 మందికి గాను 159 మంది, సరస్వతి అన్ ఎయిడెడ్ పాఠశాలలో 121 మంది గాను 118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 9 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య తెలిపారు. మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాలను ఎంఈఓ సందర్శించారు. తాళ్లూరులోని రెండు పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ రమణా రావు, ఎంఈఓ -2 నుధాకర్ రావు, స్క్వాడ్ అధికారి బాలాజీలు నందర్శించి నంతృప్తి వ్యక్తం చేసారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంధ్ బాష, యు వెంకటేశ్వర్లు, నుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్లుగా శ్రీనివాస రావు, స్వామి దాను, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించారు.
