పర్చూరు జెడ్పీటీసీ కొల్లా గంగా భవానీ మృత దేహానికి జెడ్పీ చైర్పర్సన్ బూచే పల్లి వెంకాయమ్మ ఘనంగా నివాళులర్పిం చారు. మండలంలోని నాగుల పాలెం గ్రామం లోని జెడ్పీటీసీ గంగా భవానీ ఇంటికి మంగళ వారం ఆమె స్వయంగా వెళ్లి మృతదేహాన్ని సం దర్శించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రావి పద్మావతి, నియోజకవర్గ వైసీపీ నాయకుడు రావి రామనాథంబాబు, మాజీ జెడ్పీటీసీ భవనం శ్రీనివాసరెడ్డి, చినగంజాం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు టీ. శ్రీనివా సరావు తదితరులు పాల్గొని గంగాభవానీ భౌ తిక కాయానికి నివాళులర్పించారు.



