సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం రిటైర్డ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో రిటైర్డ్ జస్టిస్ రమణ కు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు.
జిల్లా జడ్జి వీర్రాజు,
ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, విజివో శ్రీ మనోహర్, ఆగమ సలహాదారుశ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.

