జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం ప్రత్యేక
పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు..పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు పది చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 12.626 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎ శ్రీనివాసరావు తెలిపారు. సౌకర్యాలను ఆలయ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఈఓ భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముండ్లమూరు ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన మల్లిఖార్జునరావు కుంటుంబసభ్యులతో కలసి అమ్మవారికి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
