కూకట్ పల్లి మెట్రో పార్క్ లో ఎరుకుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ప
మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన సభను నిర్వహించారు .ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…60 కోట్ల రూపాయలతో ఎరుకల ఎంపవర్ స్కీమ్ ఏర్పాటు చేశామని..నేడు ఎరుకల జాతిని గౌరవించి …ఆరాధ్య దైవం అయిన నాంచారమ్మ ను గౌరవించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని. ఎమ్మెల్సీ గా సత్తన్న నీ శాసన మండలికి పంపిన విషయం అందరికీ తెలిసిందే అని…నేడు రాములన్నను మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ దే అని తెలిపారు…అలాగే 5కోట్ల రూపాయలతో నిజాం పేట లో ఆత్మ గౌరవ భవనం నిర్మించాం అని …మరి గత కాంగ్రెస్ …బీజేపీ ప్రభుత్వాలు చేశయా అని ప్రశ్నించారు.
