అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు లేఖలు రాసిన తెలంగాణా చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్.
అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్న సీఈఓ.
ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం.
ఆ మేరకు మీడియా సంస్థలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం.
ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచన.
సదరు ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా జతపరచిన సీఈఓ కార్యాలయం.