కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వక్తలు అన్నారు. మన్నేపల్లి పంచాయితీ పరధిలో దారం వారి పాలెంలో గురువారం ‘ వై నీడ్స్ ఎపీ జగన్ ‘ కార్యక్రమం నిర్వహించారు. వైస్ ఎంపీపీ ఎం ఎన్ పి నాగార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, ఈఓఆర్డీ కెజీఎన్ రాజు, ఎపీఎం దేవరాజ్, ఉప సర్పంచి ఇంద్రసేనా రెడ్డి లు పాల్గొని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. లబ్ధి పట్టికను ఆవిష్కరించారు.

