తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో కార్తీక పౌర్ణమి పురస్కరిం చుకొని ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే తలస్నానాలు ఆచరించి ఉపవాసాలున్నారు. బొద్దికూరపాడులో కార్తిక దీపోత్సవాన్ని పెద్దలు, చిన్నా రులు కలసి చేశారు. మాధవరంలో గంగా పర్వతవర్ధినీ సమేత నీలకంఠే శ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలసి జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. గుంటి గంగలో కొలు వుదీరిన గంగాభవానీ అమ్మవారికి పూజలు నిర్వహించారు.
