శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు ప్రజలను చల్లగా చూడాలి……కోట నీలిమ.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయం లో అమ్మవారిని సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వంగా అంబుజ,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ లు ఆలయ సంప్రదాయాల ప్రకారం కోట నీలిమని ఆలయం లోకి తోడ్కొని వెళ్లి పూజలు నిర్వహింపజేసారు.అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోట నీలిమ వెంట సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్ , కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అభిషేక్ అడపా,అమరం శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు హోసి టోచర్, పవన్ , రమేష్ , సుమిత్ కుమార్ ,శీలం అనురాగ్ ,అడ్డు , మునీర్ ఖాన్ , హనీఫ్ ఖాన్ ,రాహుల్ , ప్రవీణ్ మహిళా కాంగ్రెస్ నాయకులు రమాదేవి, రాధా , చంద్రకళ మరియు పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *