రైతులు అకాల వర్షాలు, వడగండ్ల వానలు వచ్చే పరిస్థితులు ఉన్నందున వరి కోతలను
వాయిదా వేసుకోవాలని, సాధ్యమైనంత వరకు నష్టనివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అన్నారు. మండలంలో మొక్కజొన్న 6482 ఎకరాలు, వరి 3593 ఎకరాలు, ప్రత్తి 1889 ఎకరాలు, పొగాకు 971 ఎకరాలు, నువ్వులఱు 353 ఎకరాలు, చెరకు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయన్నారు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లయితే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
