ఓటర్ల జాబితా సవరణలో కచ్చితత్వం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. బి.ఎల్.ఓ.లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నందున శుక్రవారం ఆయన ఒంగోలు సుజాత నగర్ లో ఈ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ …. ఈ ప్రాంతంలోని 93వ నెంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో 576 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జాబితాలో చేర్పులు, తొలగింపులకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధానాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది పాటిస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడానికే తాను ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. సిబ్బందికి ఈ విషయాలపై ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల జాబితా తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 90-100 పోలింగ్ కేంద్రాల సూపర్ వైజర్ కె. శ్రీనివాసరావును కలెక్టర్ సస్పెండ్ చేశారు.
కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, తహిశీల్దార్ మురళి, తదితరులు ఉన్నారు.
ఓటర్ల జాబితా సవరణలో కచ్చితత్వం అత్యంత కీలకము – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
11
Aug