తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెంలో ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని తహసీల్దార్ కెవిప్రసాద్ ప్రారంభించారు. తూర్పుగంగవరం పిహెచ్సి వైద్యాధికారి బంకా రత్నం మాట్లాడుతూ …శిబిరంలో 438 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి నట్లు తెలిపారు. నాగంబోట్ల పాలెం రామభద్రపురం సర్పంచ్ లు చిమటా సుబ్బా రావు, వెంకటలక్ష్మి, సోము అనిల్ రెడ్డి, నరసింహా రెడ్డి, వైద్యులు రత్నం కె. మౌనిక, రాజేష్ యాదవ్, లీనా మిల్లెర్డ్, ప్రణవి తదితరులు పాల్గొన్నారు.




