ఆంధ్రప్రదేశ్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్అన్నారు. గురువారం దర్శి మండలం బొట్లపాలెంలో ఆంధ్రప్రదేశ్ కుజగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. జేసీఎస్ కన్వీనర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగాస్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …జగన్ సచివాలయ వ్యవస్థ,వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా
బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో దర్శికమీషనర్ వై మహేష్, ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, రాష్ట్ర కార్పొరేషన్ డైరక్టర్ అంజిరెడ్డి, కౌన్సిలర్లు వీసీ రెడ్డి, మోహన్ రెడ్డి, నాయకులు గంగిరెడ్డిపాలెం ఎలమందరెడ్డి, హరీష్, యర్రయ్య, వాసుదేవరెడ్డి, మిల్లర్ బుజ్జి, అచ్చయ్య, దేవప్రసాద్, శాగం పాపిరెడ్డి,
శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


