ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 40శాతం రాయితీపై రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయటం జరుగుతుందని అవసరమైన రైతులు ఉపయోగించుకోవాలని మాజీ సొసైటీ అధ్యక్షుడు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నారు. బొద్దికూరపాడు రైతు భరోసా కేంద్రం వద్ద గురువారం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాల కోటయ్య, విఏఏ అజ్మీర్, సొసైటీ సెక్రటరీ పులి శ్రీనివాస రెడ్డి, రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

