బొద్దికూరపాడు శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం భక్తి శ్రర్థలతో ఘనంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప … మాల ధారణం నియమాల తోరణం.. అంటూ అయ్యప్ప పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రర్థలతో నిర్వహించారు. అయ్యప్ప, శివ, కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి మాలధారులు అయ్యప్పస్వామికి అభిషేకం చేసారు. స్వాములు, భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పూజారి గురుస్వామి ఎన్వీ రమణయ్య, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


