తాళ్లూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా రెండో సారి ఎకగ్రీవంగా ఎన్నికైన తూము వెంకట సుబ్బారెడ్డిని పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో గుంటి గంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా వైకాపా జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, ఎంపీటీసీ రమణ కోటేష్, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం, చిన్న నాగరాజు తదితరులు ఉన్నారు.
