బేగంపేట ఆగస్టు 15, (జే ఎస్ డి ఎం న్యూస్) : అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ అని, బడుగులకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అని, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన సాగుతుందని బేగంపేట ప్రకాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్గా కరుణాకర్ అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ఎరుకల బస్తీ చౌరస్తా, అంబేద్కర్ నగర్ కాలనీ, అల్లం తోట బావిలలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని, మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బేగంపేట్ రమేష్, శ్రీనివాస్ రెడ్డి,హోసీ తోచర్, జైపాల్, జాన్, ఏ బ్లాక్ మహిళ అధ్యక్షురాలు రమాదేవి,ఏకే జాంగిర్ ,రాధ,చంద్రకళ, ఎరుకల సురేష్,శాంతి, కొండ కిరణ్,సాంబయ్య, పద్మ రెడ్డి,బిట్టు,రాకేష్, సురేష్ బాబు, పర్వేజ్,భారత, నరేందర్,శ్యామ్మోహిత్,యాసిన్, ఆర్పీలు, ఆశా వర్కర్స్,
మరియు జిహెచ్ఎంసి పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


