సికింద్రాబాద్,ఆగస్ట్ 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ అధ్యక్షుడు దివంగత శ్యామ్ రావు డిల్లికర్ మరణం పట్ల సంస్థ కార్యవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.సికింద్రాబాద్లోని పద్మారావు నగర్, గోల్డెన్ పెటల్ బ్యాంకెట్ హాల్లో కార్యవర్గంఅత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగాదివంగత అధ్యక్షుడు డిల్లికర్తో పాటు సమాజానికి విశేష సేవలు అందించిన ఇతర దివంగత పెద్దలకు సభ్యులు ఘన నివాళులు అర్పించారు.అనంతరం పరిపాలనా కొనసాగింపు, నిర్వహణను పటిష్టం చేయడంపై సుదీర్ఘంగాచర్చించారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్’ అధికారిక రికార్డులలో సమాజ్ వివరాలనుక్రమబద్ధీకరించే చట్టపరమైన బాధ్యతలనునెరవేర్చేందుకు ఎం. భీష్మ చారి (B.Sc.,
LL.B.)ని మధ్యవర్తిగా (ఆర్బిట్రేటర్) నియమిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. సమాజంలోఐక్యతనుపెంపొందించేందుకు సభ్యుల మధ్య స్వయం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమాజకార్యకలాపాలను డిజిటలైజ్ చేసే దిశగా కొత్త సభ్యత్వ దరఖాస్తుఫారమ్లు, రసీదు పుస్తకాలను నాయకులువిడుదల చేశారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం NEFT/RTGS వివరాలతో పాటు సులభతర చెల్లింపుల కోసం ప్రత్యేక UPI స్కానర్ను అందుబాటులోకి తెచ్చారు. సమాజ భవిష్యత్తు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా నిధుల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, సమాజ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల్ ముఖ్య ప్రతినిధులు ప్రదీప్ దిల్కర్, అమర్నాథ్ చవాన్, దీపక్ బాగేలికర్, ఉదయ్ నవగిరే, సుభాష్ హెండే, విజయ్ దిల్కర్, అజయ్ నవగిరే, వినోద్ లాండ్గే, నర్సింగ్ రావు దిల్కర్, ధనరాజ్ ఉబాడే, ఓం ప్రకాశ్ పుట్లే ,తదితరులు పాల్గొన్నారు.

